‘దివ్యాంగులను పట్టించుకోని కేసీఆర్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 20 లక్షలకు పైగా ఉన్న దివ్యాంగుల సంక్షేమాన్ని కేసీఆర్ గాలికి వదిలేశారని బీజేపీ దివ్యాంగుల విభాగం కన్వీనర్ శ్రీశైలం విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో దివ్యాంగుల కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో దివ్యాంగుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం ప్రత్యేక చట్టాన్ని తెచ్చిన ఘనత బీజేపీదే అన్నారు.