రాచరికమే బాగుంటే ప్రజాస్వామ్యం ఎందుకు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు రాచరికమే బాగుందనిపిస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. రాజులను పొగిడే మనస్తత్వంతో ఉన్న సీఎం కేసీఆర్ లో నియంతృత్వ ధోరణి బయట పడుతోందన్నారు.
రాచరికపు పోకడలు, ఆడంబరాలే కేసీఆర్కు గొప్పగా కనిపిస్తున్నాయన్నారు. నిజాం పేరిట జాగీర్దార్లు, దేశ్ముఖ్లు చేసిన అకృత్యాల గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడడంలేదన్నారు. అప్పటి అకృత్యపు ఆనవాళ్లు గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నాయన్నారు. నిజాం ను రాజుగానే చూడాలి తప్ప, ఒక మతానికి చెందిన వ్యక్తిగా చూడటం సరికాదన్నారు.