అధిక విద్యుత్తు బిల్లులను రద్దు చేయాలి 

Bandi Sanjay Kumar Demands To Cancel Electricity Bills - Sakshi

15న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ కార్యాలయాల వద్ద బీజేపీ నిరసనలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: శ్లాబ్‌ల విధానంలో అధికంగా వస్తున్న విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 15న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు. విద్యుత్‌ సౌధతోపాటు జిల్లా కేంద్రాల్లోని విద్యుత్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలపై అధిక భారం మోపేవిధంగా విద్యుత్తు బిల్లులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో బీజేపీ ప్రతినిధి బృందం గురువారం మింట్‌ కాంపౌండ్‌లోని కార్యాలయంలో ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసిందని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కేసులు పెరుగుతున్నాయి
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని సంజయ్‌ ఆరోపించారు. కరోనా విషయంపై మాట్లాడేందుకు పలుమార్లు సీఎం కేసీఆర్‌ను సమయం ఇవ్వాలని కోరితే ఆయన ఇవ్వడం లేదని, శుక్రవారం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుంటే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌లు ప్రగతిభవన్‌ ముందు నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top