పార్టీ గెలుపుకోసం 32 కమిటీలు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకత్వంలో 32 కమిటీలు వేసినట్లు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ విజయమే లక్ష్యంగా కమిటీలు పనిచేస్తాయని, క్షేత్రస్థాయి నుంచి ప్రజలను, ఓటర్లను చైతన్యపర్చేలా కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అంటూ మంత్రి హరీశ్రావు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మద్దతు ధర అడిగిన రైతులను జైలులో పెట్టిన ఘనత టీఆర్ఎస్దేనని ఎద్దేవాచేశారు.