వైఎస్ జగన్ను పరామర్శించిన ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్ఐఎమ్ నేత అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. జననేత జగన్పై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో గత గురువారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. భుజానికి తీవ్ర గాయం కావడంతో నగరంలోని సిటీన్యూరో ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం డిశ్చార్జి అయి విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్ జగన్ను ఒవైసీ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.