ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో ఆదుకోలేదయ్యా..
తన చేతికి గాయమైతే రూ.లక్షా ఏభై వేలు ఖర్చయ్యింది. కానీ ఆరోగ్యశ్రీలో కేవలం రూ.30 వేలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బులను అప్పుచేసి వైద్యం చేయించుకున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది సర్పవరానికి చెందిన ఉపాధి కూలీ సలాది సత్యవతి. నాలుగు నెలల క్రితం ఏటిగట్టు వద్ద గుర్రపుడెక్క తొలగిస్తూ పడిపోవడంతో చెయ్యి విరిగిందన్నారు. తన భర్త ఆరేళ్ల క్రితమే చనిపోయారని, ముగ్గురు ఆడపిల్లల్లో ఒక అమ్మాయికి మాత్రమే పెళ్ళి చేయగలిగానంటూ జగన్కు తన సమస్యను చెప్పుకున్నారు సత్యవతి.