ఎంత రెచ్చగొట్టినా సంయమనమే: బొత్స
సాక్షి, విజయనగరం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంత్రి బొత్స శనివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ..‘పచ్చ నేతలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. చిన్న చిన్న ఘటనలను చూపి లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. (టీడీపీకి హైకోర్టులో చుక్కెదురు)
చంద్రబాబు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తాం. ఆయన తానా అంటే పవన్ కల్యాణ్ తందానా అంటున్నారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీకి పట్టం కట్టడం ఖాయం. గత అయిదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆయనకు విలువలు, సిద్ధాంతాలు లేవు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నాయి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. సీఎం జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి’ అని అన్నారు. (టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమై దాడులు)
సంబంధిత వార్తలు