ప్రత్యేక హోదా సాధనకు మద్దతివ్వండి

Ap Jac Asking To Ys jagan Support For special status - Sakshi

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు మద్దతు ఇవ్వాలని జగన్‌ను ఏపీ జేఏసీ నాయకులు కోరారు. గురువారం కందుకూరు వద్ద ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ను  ఏపీ విద్యార్థి జేఏసీ సమన్వయకర్త జైపాల్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి పులిరాజు, ఎస్‌కేయూ జేఏసీ కన్వీనర్‌ క్రాంతికుమార్‌ తదితరులు కలిసి మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 20న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామని ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించాలని విన్నవించడంతో పోస్టర్లను జగన్‌ విడుదల చేశారు. హోదా సాధించే వరకూ తమ పోరాటాలు ఆగవని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top