నేడు రాష్ట్రానికి అమిత్‌షా

Amit Shah to the state today - Sakshi

నాలుగు జిల్లాల్లో ఎన్నికల సభలు 

పాల్గొననున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. ఆదివారం ఉదయం 10.20కి బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌ చేరుకుంటారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నేడు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. పరకాల, నిర్మల్, నారాయణ్‌ఖేడ్, దుబ్బాక నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు తెలిపారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఆదివారం సాయంత్రం 6.45కి హైదరాబాద్‌ నుంచి ఇండోర్‌ వెళతారని చెప్పారు. అలాగే అమిత్‌షా ఈ నెల 28న ఉదయం 11.50కి ఆదిలాబాద్‌లో, మధ్యాహ్నం 2 గంటలకు చౌటుప్పల్‌ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3.45కి హిమాయత్‌నగర్‌లోని లిబర్టీ సర్కిల్‌ నుంచి ఆర్‌టీసీ క్రాస్‌రోడ్డు వరకు నిర్వహించే రోడ్‌షోలో పాల్గొననున్నారు. సాయంత్రం 5.45కి ఎల్బీనగర్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. డిసెంబర్‌ 2న ఉదయం 11.50కి నారాయణ్‌పేట్, మధ్యాహ్నం 1.35కి ఆమన్‌గల్‌ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పల్‌ రోడ్‌షోలో పాల్గొంటారు. సాయంత్రం 5.15కి కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
అమిత్‌ షా షెడ్యూలు వివరాలు.. 
- ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలోని అంగడి వద్ద బహిరంగ సభ 
మధ్యాహ్నం 1.05 నుంచి 2.10 వరకు నిర్మల్‌లోని విశ్వనాథ్‌పేట వద్ద ఉన్న ప్రిన్స్‌ హైస్కూల్‌ గ్రౌండ్స్‌ సమీపంలో బహిరంగ సభ 
మధ్యాహ్నం 2.45 నుంచి 3.40 వరకు సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ అనురాధా కాలేజ్‌ గ్రౌండ్స్‌ సమీపంలో బహిరంగ సభ 
సాయంత్రం 4.10 నుంచి 5.05 వరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక వెంకటేశ్వర బీఈడీ కాలేజ్‌ సమీపంలో బహిరంగ సభ 
సాయంత్రం 6 నుంచి 6.20 వరకు హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top