చంద్రబాబుతో మాకే వైరం లేదు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తమకెలాంటి వైరం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మీకు వైరం ఎందుకొచ్చిందన్న ప్రశ్నకు సమాధానంగా ‘చంద్రబాబుతో మాకు ఎలాంటి వైరం లేదు.
ఆయనే ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు’అని చెప్పారు. ఏపీ ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని (బీజేపీ)ని విలన్గా చూస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావించగా ‘ప్రతి ఒక్కరికీ ఒక్కో ఇబ్బందికర సందర్భం ఉంటుంది’అని తెలిపారు. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం కోసమే హరిబాబు రాజీనామా చేశారని అమిత్ షా వివరించారు.
సంబంధిత వార్తలు