ఏబీఎన్‌ సర్వే బోగస్‌ అని రుజువైంది 

ABN survey is proven to be bogus - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ట్వీట్‌ 

సాక్షి, అమరావతి: ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చేసిన సర్వే.. కల్పితమైంది, వారికివారు రూపొందించుకున్నట్టు తేలిపోయింది’ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం ట్వీట్‌ చేశారు. గతంలో తాను చేసిన సర్వేనే ఏబీఎన్‌ ఇలా వాడుకుందని లగడపాటి చెప్పినట్టు పేర్కొన్నారు. మీడియా సమక్షంలోనే సర్వే ఫలితాలను స్వయంగా వెల్లడించడం లగడపాటి సంప్రదాయమన్నారు.

సర్వే బృందం సేకరించి ఇచ్చిన సమాచారాన్ని అసలు క్రోడీకరించలేదని, ఈ విషయంలో ఏబీఎన్‌ దొంగాట ఆడిందని తమ పరిశీలనలో స్పష్టమైందన్నారు. లగడపాటి పేరుతో ఏబీఎన్‌ ప్రసారం చేసిన సర్వే ఒకబోగస్‌ అని, ఈ సర్వే ఏబీఎన్‌ సృష్టించిందని, సర్వేకు చంద్రబాబు ఆర్థికంగా సహకరించారన్నారు. ఈ విషయంపై చంద్రబాబు, ఏబీఎన్, లగడపాటి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top