2019లో అధికారంలోకి రావడం ఖాయం
నర్సాపూర్(జి)(నిర్మల్) : 2019లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ మల్లికార్జున్రెడ్డి, కృష్ణా, గోదావరి నదీజలాల రాష్ట్ర కమిటీ కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు.
నరేంద్రమోదీ పాలనకు స్వాగతం పలుకుతూ కర్ణాటకలో బీజేపీ జెండా ఎగురవేసిందన్నారు. 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలో తెస్తామని, ఇందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కుటుంబపాలన నడుస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు నరేందర్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.