వైఎస్‌ జగన్‌కు జననీరాజనం

141th Day PrajaSankalpaYatra Bigins - Sakshi

సాక్షి, కృష్ణా : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 141వ రోజు ఈదర శివారు నుంచి శనివారం ఉదయం వైఎస్ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం సీతారాంపురం, బత్తులవారిగూడెం క్రాస్‌ మీదుగా యనమదలకు పాదయాత్ర చేరుకుంటుంది.

అనంతరం నూజివీడులోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్‌కు చేరుకుని వైఎస్‌ జగన్‌ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ప్రజలనుద్దేశించి జననేత ప్రసంగిస్తారు.

  • ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీతారాంపురం గ్రామానికి చేరుకున్నారు. వేల మంది ప్రజలు వైఎస్‌ జగన్‌తో కలసి అడుగులో అడుగేస్తున్నారు.
  • వైఎస్‌ జగన్‌ పాదయాత్ర బత్తులవారిగూడెం చేరుకుంది. వందల సంఖ్యలో గ్రామ ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.
  • ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ యనమదలకు చేరుకున్నారు. ఆత్మీయ నేతకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top