వారికే ప్రజలు ఓటు వేయాలి: పవన్ కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం, తగినంత సమయం అందుబాటులో లేకపోవడం వల్ల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీచేయలేకపోయానని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పరిపాలన అందివ్వగలరో.. వారికే ప్రజలు ఓటు వేయాలని ఆయన సూచించారు. అనేక ఒడిదుడుకుల మధ్య తెలంగాణ యువత సరికొత్త రాష్ట్రాన్ని సాధించుకుందని, తెలంగాణ అంటే తనకు సంపూర్ణమైన గౌరవముందని చెప్పారు.