రక్షణ దళాల నిధికి గవర్నర్ విరాళం
రక్షణ దళాల నిధికి గవర్నర్ విరాళం
చెన్నై: రక్షణ దళాల పతాక నిధికి తమిళనాడు గవర్నర్ భన్వర్లాల్ పురోహిత్ రూ.25 వేల విరాళం ఇచ్చారు. రక్షణ దళాల పతాక దినోత్సవ నిధి కోసం రూ.25 వేల డిడిని బుధవారం అందజేసినట్లు రాజ్భవన్ తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు కూడా తమ వంతు విరాళాలు అందజేయాలని సీఎం పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. యుద్ధ సమయంలో మృతిచెందిన సైనికుల కుటుంబాలకు, గాయపడిన సైనికులకు, వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పదవీ విరమణ చేసిన సైనికులకు ఈ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.