కువైట్లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, కువైట్: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ కువైట్ సభ్యులు ఘనంగా జరిపారు. కువైట్ మైనారిటీ సెల్ ఇంచార్జ్ షేక్ రహమతుల్లా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర చేపట్టారన్నారు.
వైఎస్ జగన్కి కమిటీ సభ్యుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీ ఇంచార్జ్ షేక్ గఫార్, వైఎస్ ఇంచార్జ్ షేక్ రహమతుల్లా మాట్లాడుతూ.. ఈ రోజు ముస్లిం యువకులు ఉన్నత విద్య చదువుకుంటున్నారంటే అది కేవలం మహానుభావులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవే అన్నారు. తన తండ్రి ఆశయ సాధన కొరకు పనిచేస్తున్న తమ అధినేత... ముస్లిం సోదరులకు అండగా ఉంటారని తమకు నమ్మకం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, ప్రధాన కోశాధికారి నాయని మహేష్ రెడ్డి, సలహాదారుడు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, షేక్ ఇనాయత్, అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి, బీసీ ఇంచార్జ్ కె రమణ యాదవ్, సోషల్ మీడియా ఇంచార్జ్ గాలివీటి ప్రవీణ్ రెడ్డి, యూత్ ఇంచార్జ్ మర్రి కళ్యాణ్లు పాల్గొన్నారు.