మలేషియాలో జగిత్యాలవాసి మృతి

Man from Telangana dies in Malaysia

కౌలాలంపూర్ :
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల గ్రామానికి చెందిన బోదాసు లక్ష్మణ్ (37) మలేషియాలోని కౌలాలంపూర్లో గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి మలేషియాలోని ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని ఈ ఆదివారం ఎమ్‌హెచ్‌198 విమానంలో హైదరాబాద్కు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వంతో ఉచిత అంబులెన్సు ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నారు.

బతుకుదెరువు కోసం మలేషియా వచ్చిన కొన్ని రోజుల్లోనే లక్ష్మణ్ ఆరోగ్యం క్షీణించి గుండెపోటుతో మరణించారు. లక్ష్మణ్కి కూతురు, కొడుకు ఉన్నారు. కుటుంబ సభ్యులు లక్ష్మణ్‌ మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఆయన మరణంతో కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయినట్టయింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top