వైఎస్‌ జగన్‌కు మలేషియా ప్రవాసాంధ్రుల అభినందనలు

Malaysian andhra people congratulations to YS Jagan - Sakshi

కౌలాలంపూర్‌ : ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జననేత జగన్‌ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా మలేషియా వైఎస్‌ఆర్‌సీపీ విభాగం  అయనకు ఆయనకు అభినందనలు తెలిపింది.

ఆయన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా శక్తిని ప్రసాదించాలని మలేషియా ప్రవాసాంధ్రులం ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నామన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న కష్టాలకు పాదయాత్ర ద్వారా అండగ ఉంటానని భరోసా ఇస్తున్న జననేత​​‍కు ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో మలేషియాలో నివసిస్తున్న తిప్పరాజు రేవంత్‌, విజయ్‌ భాస్కర్‌, మహేష్‌ బాబు, విష్ణు, వాసు, కిరణ్  వైటిఎస్, హర్ష, మురళీదర్, ముకేశ్,  సాంబ, కోటిలు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top