వైఎస్ జగన్కు మలేషియా ప్రవాసాంధ్రుల అభినందనలు
కౌలాలంపూర్ : ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జననేత జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా మలేషియా వైఎస్ఆర్సీపీ విభాగం అయనకు ఆయనకు అభినందనలు తెలిపింది.
ఆయన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా శక్తిని ప్రసాదించాలని మలేషియా ప్రవాసాంధ్రులం ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నామన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న కష్టాలకు పాదయాత్ర ద్వారా అండగ ఉంటానని భరోసా ఇస్తున్న జననేతకు ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో మలేషియాలో నివసిస్తున్న తిప్పరాజు రేవంత్, విజయ్ భాస్కర్, మహేష్ బాబు, విష్ణు, వాసు, కిరణ్ వైటిఎస్, హర్ష, మురళీదర్, ముకేశ్, సాంబ, కోటిలు పాల్గొన్నారు.