యూకేలో రోడ్డు ప్రమాదం: ఖమ్మంవాసి మృతి
లండన్ :
యూకేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లావాసి మృతిచెందారు. ఖమ్మం జిల్లా బురంపురంకు చెందిన శ్రీధర్ మున్నలూరి భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి యూకేలోని స్విండన్లో బ్రూనెల్ క్రిసెంట్లో నివాసముంటున్నారు.
స్విండన్లో శనివారం కారు ఢీకొట్టడంతో శ్రీధర్కు తీవ్రగాయాలయ్యాయి. కాగా, చికిత్స పొందుతూ మంగళవారం శ్రీధర్ కన్నుమూశారని స్విండన్ హిందూ దేవాలయ ఛైర్మన్ ప్రదీప్ భరద్వాజ్ తెలిపారు. శ్రీధర్ మరణ వార్త విని కమ్యునిటీలోని అందరం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు.