లండన్లో భారతీయుల శాంతి ర్యాలీ
రాయికల్(జగిత్యాల): కశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో మరణించిన జవాన్లకు లండన్లోని భారతీయులు ఆదివారం నివాళులర్పించారు. లండన్లోని వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయులంతా కలిసి పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం నుంచి యూకే ప్రధానమంత్రి కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన నాయకులు కుర్మాచలం అనిల్, చిరుముల్ల సత్య, గంప వేణుగోపాల్, పసునూరి కిరణ్, సురేశ్, మంగళగిరి, ప్రశాంత్, రామకృష్ణ, సురేశ్, జయంత్ తదితరులు పాల్గొన్నారు.