మలేసియాలో ప్రవాస భారతీయుడిని కాల్చిచంపిన దుండగులు
కౌలాలంపూర్: మలేసియాలో ప్రవాస భారతీయుడొకరిని దుండగులు కాల్చిచంపారు. పెనాంగ్ రాష్ట్రంలోని బటర్ వర్త్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. ఆలయం వెలుపల వేచివున్న దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎన్నారై ఎమ్ రవీంద్రన్(19) ప్రాణాలు కోల్పోయాడు.
51 ఏళ్లు, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని గుర్తించాల్సివుంది. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు కనీసం ఆరురౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి ఆరు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.