ఒడిశా బ్రాడ్కాస్ట్..వెబ్ చానల్ ప్రారంభం
బరంపురం: స్థానిక డైమండ్ జూబ్లీ టౌన్ హాల్ ప్రాంగణంలో ఒడిశా బ్రాడ్కాస్ట్..అనే కొత్త వెబ్ చానల్ను ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో హాజరై ప్రారంభజ్యోతిని వెలిగించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ఎం.డి ఉషా పట్నాయక్, న్యూస్ ఎడిటర్లు ప్రకాష్ పట్నాయక్, జ్యోతి రంజన్ పట్నాయక్, ఆలిండియా రేడియో డైరెక్టర్ రుశీకేశ్ పాణిగ్రహి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి హోలీకిశోర్ పట్నాయక్, ఎంఎల్ఏ రమేష్ చంద్ర చావ్ పట్నాయక్, బీడీఏ చైర్మన్ సుభాష్ మహరణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్ను పతి, సుదీప్సాహు పాల్గొని సామజిక వార్తలపై వివిధ రకాలుగా ప్రసగించారు. కార్యక్రమంలో నగర ప్రముఖులు, ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.