రూ. 2వేల నోటుకోసం ఓ యువతి..

Young Woman Jumps On Track For 2 Thousand Note In Delhi - Sakshi

న్యూ ఢిల్లీ : రెండు వేల రూపాయల నోటు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ యువతి రైలు పట్టాలపైకి దూకింది. ఆమెపై నుంచి మెట్రోరైల్‌ దూసుకెళ్లినా అదృష్టం కొద్ది బతికిబైట పడింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ఓ 26 ఏళ్ల యువతి మంగళవారం ఉదయం పదిగంటల ప్రాంతంలో ఢిల్లీలోని ద్వారకా మోర్‌ మెట్రో స్టేషన్‌కు వచ్చింది. మరికొద్ది సేపట్లో రైలు వస్తుందనగా ఆమెకు చెందిన రెండువేల రూపాయల నోటు ఎగిరి పట్టాలపై పడింది.  నోటు కోసం పట్టాలపైకి దూకిన ఆ యువతి నోటు తీసుకోవటంలో బిజీ అయ్యింది.

బిజీలో అదే పట్టాలపై వేగంగా ఆమెవైపు వస్తున్న మెట్రోరైలును గమనించలేదు. అడుగుల దూరంలోకి రైలు రాగానే అది గమనించి వెంటనే పట్టాలపై నిలువుగా పడుకుండిపోయింది. ఆ మెట్రోరైలు ఆమెపై నుంచి కదిలివెళ్లిపోయింది. అయితే ఈ ఘటనలో ఆమెకు ఏ చిన్న గాయం కాకపోవడం అదృష్టం. సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోని, లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పటంతో వదిలేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top