ఎంపీ సీటుకు సీఎం రాజీనామా
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురువారం లోక్సభ సెక్రటేరియట్కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. ఆయన కేబినెట్లో ఉపముఖ్యమంత్రిగా ఉండి ఇటీవల ఎమ్మెల్సీ అయిన కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
గోరఖ్పూర్ నుంచి ఆదిత్యనాధ్, ఫుల్పూర్ నుంచి మౌర్యలు లోక్సభకు ఎన్నికయ్యారు. వీరి రాజీనామాలు ఆమోదం పొందిన తర్వాత ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించనుంది. కాగా, కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పరికర్ గోవా ముఖ్యమంత్రిగా నియమితులైన అనంతరం ఇటీవలి ఉప ఎన్నికలో పనాజీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు.