‘ఇద్దరు కాదు.. నలుగురు కలిసినా వార్‌ వన్‌సైడే’

Ycp Fires On Pawan Kalyan Over Actors Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్యాకేజ్‌ స్టార్‌గా మారిన పవన్‌ కళ్యాణ్‌లో ఉన్మాదం కట్టలు తెంచుకుందని, యజమానికి సేవ చేయడంలో ఆయన టెన్షన్‌ పడుతున్నారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టయినా చంద్రబాబు కళ్లలో ఆనం‍దం చూడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కలిసినా మరో నలుగురు కలిసి వచ్చినా ఫలితం ఏకపక్షమేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్‌లో ఆంధ్రులను కొడుతున్నారని పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా పవన్‌ కళ్యాణ్‌ వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల కోసం సఖ్యతగా ఉంటున్న తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడం పవన్‌ కళ్యాణ్‌కు తగదని పలువురు మండిపడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top