ఫలితాలెలా వచ్చినా నైతిక విజయం కాంగ్రెస్దే: గెహ్లాట్
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని గుజరాత్ కాంగ్రెస్ ఇంచార్జి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపై ప్రచారం చేసిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తాను గుజరాత్కు చెందిన వాడినని, ఓడిపోతే గుజరాత్ గౌరవానికి భంగం కలుగుతుందని ప్రచారం చేశారని మండిపడ్డారు.
కానీ, కాంగ్రెస్ పార్టీ రైతులు, దళితులు, గిరిజనులు, వ్యాపారులకు సంబంధించిన అంశాలపై ప్రచారం చేసిందని గుర్తు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినా.. గెలిచినా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యత తీసుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా.. అదో ఊహాజనిత(హైపోథిటికల్) ప్రశ్న అని సమాధానమిచ్చారు. దానిపై మాట్లాడాల్సిందేమీ లేదన్నారు. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలు విజయం సాధించినట్లేనని చెప్పారు.