మహాత్మునికి  ఘన నివాళులు

tribute to mahatma gandhi  - Sakshi

ఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ 70వ వర్థంతి ఈ సందర్భంగా ఢిల్టీలోని ఆయ‌న సమాధి రాజ్‌ఘాట్‌లో ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు.  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌,  మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీ రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించారు. 

వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యలయంలో..
విజయవాడ : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మహాత్మునికి నివాళులు అర్పించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీమంత్రి బొత్సా సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు.  మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, నేతలు బొప్పన భవకుమార్,  సోమినాయుడు, అవుతు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని,  ఆయన చూపిన బాట నేతలకు శిరోధార్యం అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top