ఒక్క క్లిక్‌తో నేటి వార్తా ప్రపంచం

Today News Roundup 20th July 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధాన మంత్రి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల లోక్‌సభకు విశ్వాసం ఉందా, లేదా తెలుసుకోవడానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం విశ్వాసం లేదా అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడతారు. సాధారణంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షం ప్రవేశపెడితే, విశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది. రెండు తీర్మానాల సందర్భంగా కూడా ప్రభుత్వ సాఫల్య, వైఫల్యాలపై చర్చకు (కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు మినహాయిస్తే) అవకాశం లభిస్తుంది.

‘విశ్వాసం–అవిశ్వాసం’ విశేషాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల లోక్‌సభకు విశ్వాసం ఉందా, లేదా తెలుసుకోవడానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం విశ్వాసం లేదా అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడతారు.

మోదీని కౌగిలించుకున్న రాహుల్‌ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. లోక్‌సభలో శుక్రవారం ఊహించని దృశ్యం కంటపడింది.

చంద్రబాబు ఎప్పటికీ మాకు మిత్రుడే : రాజ్‌నాథ్‌
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాళ్ల దగ్గర సంఖ్యా బలం కూడా లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

మాజీ అధ్యక్షురాలికి మరో 8 ఏళ్లు శిక్ష
సియోల్‌ : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గున్‌ హైకి ఎనిమిదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ సియోల్‌ సెంట్రల్‌ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.

‘టీడీపీ తూట్లు పొడిచి.. వ్యర్ధమైన ప్రసంగాలు’
సాక్షి, హైదరాబాద్‌ : ఎన్‌డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.

చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్‌
చిత్తూరు జిల్లా: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్‌ అయ్యారు.

అవిశ్వాసంపై చర్చ: గల్లా ప్రసంగం సాగిందిలా...
సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రారంభించారు. గంటపాటు సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన..

హైకోర్టును ఆశ్రయించిన పరిపూర్ణానంద స్వామి
హైదరాబాద్‌ : ఆరు నెలలపాటు నగర బహిష్కరణకు గురైన స్వామి పరిపూర్ణానంద స్వామి శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు.

‘వాళ్ల హనీమూన్‌ సమయంలో మాకు అన్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పనితీరును తెలంగాణ ప్రజలు మెచ్చడం లేదని, తమ రాష్ట్రానికి సంబంధించిన తొలి ఆర్డినెన్స్‌నే రాజ్యాంగ విరుద్ధంగా జారీ చేశారని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు.

అంచనాలను బీట్‌ చేసిన విప్రో
ముంబై : దేశీయ మూడో టెక్‌ దిగ్గజం విప్రో స్ట్రీట్‌ అంచనాలను బీట్‌ చేసింది. తన తొలి క్వార్టర్‌ ఫలితాల్లో నికర లాభాలను రెండు శాతం పెంచుకుంది.

హాకీ ప్రపంచకప్‌ నిర్వాహాకులపై ఫ్యాన్స్‌ ఫైర్‌
లండన్‌ : మహిళల హాకీ ప్రపంచకప్‌ టోర్నీ నిర్వాహకులపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రణబీర్‌ కపూర్‌కు ​కోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌పై పుణె సివిల్‌ కోర్టులో దావా దాఖలైంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top