తీరంలో తాళపత్రాలు

సోంపేట: మండలంలోని ఇస్కలపాలెం ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని డి.భార్గవికి సముద్ర తీరంలో సోమవారం తాళపత్రాలు దొరికాయి. వీటిపై ఒరియా లిపి ఉంది. సోమవారం సాయంత్రం పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు జయలక్ష్మి, రాజారావు తదితరులు తీరానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో విద్యార్థినికి 300 ప్రతులతో ఉన్న తాళపత్ర గ్రంథం దొరకడంతో ఆమె ఉపాధ్యాయులకు అప్పగించింది. ఒడియా మాధ్యమంలో ఉండడంతో  తాళపత్రాల వివరాలు తెలియరాలేదని ఉపాధ్యాయులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top