మీడియాకు విజువల్స్.. శశికళకు రాజభోగాలు
సాక్షి, బెంగళూరు : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ మరోసారి వార్తల్లో నిలిచారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి ఆమెను తొలగించడమే కాకుండా ఆమెను అన్ని రకాల పదవుల నుంచి తప్పించడంతో మరింత కష్టాల్లోకి వెళ్లారంటూ ఓపక్క వార్తలు వస్తుండగా ప్రస్తుతం జైలులో ఉంటున్న ఆమె మాత్రం చాలా దర్జాగా, సుఖంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
జైలులో శశికళకు రాజభోగాలు అందుతున్నట్లు కీలక సమాచారం. ఆమెకు ఐదు రూమ్ల సూట్, ప్రత్యేక కిచెన్ ఏర్పాటుచేసినట్లు కూడా తెలిసింది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మీడియా చేతికి చిక్కాయి. ఇప్పటి వరకు ఆమెకు ఎలాంటి పనిని జైలు అధికారులు అప్పగించకపోవడం కూడా గమనార్హం.