‘ఇక ఢిల్లీలోనూ పాగా వేస్తాం’

Sanjay Raut Says Dont Be Surprised if Shiv Sena Llands Up In Delhi Too - Sakshi

ముంబై : మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వం శివసేన సారథ్యంలో ఏర్పాటవుతుందన తాను పేర్కొంటే ఎద్దేవా చేశారని ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. అలాంటి శివసేన ఇప్పుడు మహారాష్ట్ర సచివాలయంలో పాగా వేస్తోందని వ్యాఖ్యానించారు. శివసేన ఇదే తరహాలో ఢిల్లీలోనూ పాగా వేసినా ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా సుప్రీంకోర్టు బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని కోరిన నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తన పదవికి రాజీనామా చేయడంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ మరికాసేపట్లో కొలువుతీరనుంది. తదుపరి ముఖ్యమంత్రి శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం ఉదయం రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీని కలిసి తమ సారథ్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై సంప్రదింపులు జరిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top