ఘోర రోడ్డు ప్రమాదం
బదౌన్(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లా అలాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ జీపు అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టడంతో నవ వరుడితో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నవ వరుడు అంజాద్(24), రజా(36), ఇమ్రానా(37), పర్వీన్(15), ఫర్హాన్(10), సమ్రీన్(47)తోపాటు ఆరు నెలల పసి బాలుడు సంఘటన స్థలిలోనే చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ మెరాజ్(34), నస్రీన్(24), సోని(2) చనిపోయారు. వీరంతా నవ వధువును తీసుకుని వరుడి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వధువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.