లోయలో పడ్డ కారు: ఆరుగురి మృతి

గువహటి: అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఈ సంఘటన అసోంలోని జాలుక్‌బరీలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

గోలపరా నుంచి గువాహటి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top