ఆప్ రెబెల్ ఎమ్మెల్యే బీజేపీలో చేరిక
సాక్షి, న్యూఢిల్లీ : ఆప్ రెబెల్ ఎమ్మెల్యే దేవేందర్ కుమార్ షెహ్రవత్ సోమవారం కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో హెహ్రవత్ ఢిల్లీకి చెందిన బిజ్వసన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనను 2016 సెప్టెంబర్లో ఆప్ నుంచి సస్పెండ్ చేశారు.
కాగా పంజాబ్లో పార్టీ నేతలు మహిళలను లోబరుచుకుని వారికి టికెట్లు కేటాయిస్తున్నారని దేవేందర్ కుమార్ షెహ్రవత్ సంచలన ఆరోపణలు చేయడంతో ఆప్ ఆయనను సస్పెండ్ చేసింది. మరోవైపు ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు మే 12న జరగనున్న క్రమంలో ఆప్ రెబెల్ ఎమ్మెల్యే కాషాయతీర్ధం పుచ్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.