‘మోదీ డిఫెన్స్‌లో పడ్డారు’

 Rahul Says Modi Plays On Backfoot Farmers Should Be Hitting Sixes - Sakshi

జైపూర్‌ : నరేంద్ర మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ క్రికెట్‌ పరిభాషలో నిప్పులు చెరిగారు. జైపూర్‌లో జరిగిన బహిరంగసభలో రాహుల్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బ్యాక్‌ఫుట్‌లో ఆడుతున్నారని..రైతులు, యువత ముందుకొచ్చి సిక్సర్లు బాదాలని పిలుపు ఇచ్చారు. రైతులకు వ్యవసాయ క్షేత్రం వద్దే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసి వారి టమోటాలు, బంగాళాదుంపలను ఎగుమతి చేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు.

భారత రైతులు ప్రపంచమంతటికీ ఆహారం సరఫరా చేస్తారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలో​తాము కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాపీ చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రుణాల మాఫీ రైతులకు ఉపశమనం కలిగిస్తుందని, అయితే ఇది ఒక్కటే తుది పరిష్కారం కాదన్నారు. రఫేల్‌ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని ఆయన పునురుద్ఘాటించారు.

రఫేల్‌పై పార్లమెంట్‌లో చర్చ జరిగితే ప్రధాని పత్తా లేరని, రెండున్నర గంటలు మాట్లాడిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తాము అడిగిన ఏ ప్రశ్నకూ బదులివ్వలేదని ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top