ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్ నేతలు
న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. కాంగ్రెస్లో అధ్యక్ష ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం సోమవారం రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయడానికి గడువు ఉంది. షెడ్యుల్ ప్రకారం ఈ నెల 17న పోలీంగ్, 19న కౌంటింగ్ జరగనుంది. అయితే కాంపిటీషన్ లేకపోవడంతో షెడ్యుల్కు ముందే రేపు రాహుల్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది.