మోదీజీ..వీటిని ఏమంటారు?

Rahul Gandhi Says PM Narendra Modi Lying About Detention Centres - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ముస్లింలను డిటెన్షన్‌ సెంటర్లకు పంపుతారని విపక్షాలు విషప్రచారం సాగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారని అంటూ అసోంలోని మతియాలో నిర్మిస్తున్న డిటెన్షన్‌ సెంటర్‌తో కూడిన వీడియోను గురువారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఆరెస్సెస్‌ ప్రధాని భరత మాతను అవాస్తవాలతో మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ముస్లింలను తాము నిర్బంధ కేంద్రాలకు పంపుతామని కాంగ్రెస్‌ సహా విపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మోదీ ఇటీవలి ఢిల్లీ ర్యాలీలో మాట్లాడుతూ పేర్కొన్న సంగతి తెలిసిందే.

దేశంలో అసలు నిర్బంధ కేంద్రాలే లేవని ఆయన చెప్పుకొచ్చారు. కాగా మతియా నిర్బంధ కేంద్రం దాదాపు పూర్తికావచ్చిందని ఆ కేంద్రాన్ని సందర్శించిన ఓ జాతీయ టీవీ చానెల్‌ పేర్కొనడం గమనార్హం. 3000 మంది డిటెయినర్లను ఇక్కడ నిలిపిఉంచే సామర్ధ్యం కలిగిన ఈ సెంటర్‌ నిర్మాణానికి రూ 46 కోట్లు వెచ్చిస్తున్నారు. అసోం రాజధాని గువహటికి ఈ కేంద్రం 129 కిమీ దూరంలో ఉంది. 28,800 చదరపు గజాల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులతో కూడిన 15 భవనాలను నిర్మిస్తుండగా వీటిలో 13 భవనాలను పురుషులకు, 2 భవనాలను మహిళలకు కేటాయిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top