ఆర్ఎస్ఎస్ నేత హత్యను ఖండించిన రాహుల్
న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయక్ సేవక్ సంఘ్ కార్యకర్తలపై జరుగుతున్న హత్యను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. హింసను ఎవరూ ప్రేరేపించరాదని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రవీందర్ గోస్వామిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం లూథియానాలో హత్య చేశారు. దీనిపై రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ’’ఆర్ఎస్ఎస్ నేత రవీంద్ర గోస్వామి హత్యను నేను తీవ్రంగా ఖడిస్తున్నాను. హింసను ఎవరూ ప్రేరించరాదు‘‘ అని ఆయన ట్వీట్ చేశారు.