గుండెపోటుతో కేంద్రమంత్రి జవదేకర్‌ తల్లి మృతి

Prakash Javadekar's mother passes away

న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి రజనీ జవదేకర్‌ (92) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రజనీ జవదేకర్‌కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు జరుగుతాయి.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top