పనుల పురోగతిపై ప్రధాని సమీక్ష

PM Narendra Modi to Review Progress in Last Six Months - Sakshi

న్యూఢిల్లీ: వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఆరు నెలల్లో వివిధ మంత్రిత్వ శాఖలు సాధించిన పురోగతిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సమీక్షించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఆరు నెలల్లో తీసుకున్న నిర్ణయాలపై మంత్రిత్వ శాఖలు సంక్షిప్త ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నాయి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక రంగంపై ప్రధాని దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సాధారణంగా మంత్రి మండలి ప్రతి నెలా కేబినెట్‌ భేటీ తరువాత సమావేశం అవుతుంది. కానీ ఈసారి సమావేశం ప్రత్యేకంగా జరుగుతోంది.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏవిధంగా అమలు చేస్తున్నారనే దానిపై గత కొన్ని వారాలుగా ప్రధాని మోదీ సమీక్ష జరుతూనే ఉన్నారు. తాజా భేటీకి సహాయ మంత్రులు, సహాయ మంత్రులు(ఇండింపెడెంట్‌ చార్జీ) హాజరవుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రతివారం జరిగే కేబినెట్‌ సమావేశం ఈనెల 24న (మంగళవారం) జరుగుతుంది.రెండో పర్యాయం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు నవంబర్‌ నాటికి ఆరు నెలలు పూర్తి చేసుకుంది. (చదవండి: మోదీ చాలెంజ్‌ వెనుక అర్థమేంటి?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top