‘300కిపైగా స్ధానాల్లో గెలుస్తాం’

PM Modi Says BJP Led Alliance Will Win Over Three Hundred Seats   - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పాలక బీజేపీకి 300కి పైగా స్ధానాలు లభిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఖర్గోన్‌లో శుక్రవారం ఆయన తుది ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ దేశప్రజలంతా దేశ ప్రధానిగా మరోసారి తనను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని అన్నారు.

దశాబ్దాల అనంతరం వరసగా రెండోసారి విస్పష్ట మెజారిటీతో కూడిన ప్రభుత్వం ఎన్నికవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తమకు 300కు పైగా స్ధానాలను కట్టబెట్టనున్నారని ధీమా వ్యక్తం చేశారు. 130 కోట్ల మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. మీరు ఆదివారం ఓటు వేసేందుకు వెళుతూ చరిత్ర సృష్టించనున్నారని, దేశంలో వరుసగా రెండోసారి మెజారిటీ ప్రభుత్వం కొలువుతీరనుందని జోస్యం చెప్పారు. కాగా మే 19న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏడవ, తుది విడత పోలింగ్‌ జరగనుంది. ఈనెల 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top