ఐఎస్ను అణిచే మొనగాళ్లం మేమే


న్యూఢిల్లీ: ప్రపంచాన్ని నిత్యం బాంబుదాడులు, హత్యలతో వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్కు వ్యతిరేకంగా అసలైన పోరాటం తామే చేస్తున్నామని టర్కీ రాయభార ప్రతినిధి ఇండియా బురాక్ అక్కాపర్ అన్నారు. ప్రపంచంలో మిగితా దేశాలకన్నా తామే ఐఎస్ సమస్యను ఎదుర్కొంటున్నామని, అదే స్థాయిలో వారికి బదులిస్తున్నామని చెప్పారు.



'మేం సిరియాకు చెందిన ఎంతో మంది వలసదారులను బంధీ నుంచి విముక్తి చేశాం. వారికోసం మానవత్వంతో నిండిన పనులు చేశాం. ఈ సందర్భంగా మేం ప్రభుత్వాలకు ఒకటే చెప్తున్నాం. ఎంతకాలమైతే ప్రభుత్వ స్థానంలో ఉండి స్వార్థంగా ఆలోచిస్తామో అప్పటి వరకు ఉగ్రవాదం పెరుగుతూనే ఉంటుంది. ఉగ్రవాదం నిరోధించేందుకు కఠినంగా వ్యవహరించాల్సిందే. ఈ విషయంలో మేం ముందు వరుసలో ఉన్నాం' అని ఆయన ఢిల్లీలో విలేకరులతో ఆదివారం తెలియజేశారు. పొరుగు దేశాల నుంచి తమకు ఈ విషయంలో సహకారం కాస్తంత తక్కువగా ఉందని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top