కోవిడ్-19 బారిన 80 మంది రైల్వే అధికారులు
చెన్నై డివిజన్లో మహమ్మారి విజృంభణ
చెన్నై : దక్షిణ మధ్య రైల్వే లో కరోనా కలకలం రేపింది. చెన్నై డివిజన్కు చెందిన 80 మంది రైల్వే అధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బందికి నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్గా తేలింది. పలువురు రైల్వే అధికారులు, సిబ్బంది కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ప్రధాన కార్యాలయాన్ని దక్షిణ మధ్య రైల్వే మూసివేసింది. చెన్నై డివిజన్లో పనిచేసే ఉద్యోగులందరినీ క్వారంటైన్కు తరలించారు.