శివరాత్రి ప్రసాదం తిని అస్వస్థతకు గురైన భక్తులు


ఉజ్జయిని : మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో శివరాత్రి ప్రసాదం తిని సుమారు 400మంది భక్తులు  అస్వస్థతకు గురయ్యారు.   చిరిడి గ్రామంలోని   మహదేవ్  దేవాలయంలో  మంగళవారం శివరాత్రి సందర్శంగా  కిచిడి, ఖీర్ ప్రసాదాలను  పంచిపెట్టారు.   ప్రసాదాలను ఆరగించిన వెంటనే భక్తులకు   వాంతులు, విరోచనాలు  మొదలయ్యాయి.  వెంటనే స్పందించిన అధికారులు బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. సుమారు 99  మందిని జిల్లా ఆసుపత్రికి, మిగిలిన వారిని స్థానిక  ఆరోగ్య కేంద్రాలకు తరలించి  చికిత్స అందిస్తున్నామని   జిల్లా  వైద్యాధికారి తెలిపారు.  కలుషితమైన ప్రసాదం తినడం వల్లనే ఇలా జరిగిందని, సాంపిల్స్ ను పరీక్షలకు పంపించామని ఆయన తెలిపారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top