కేరళకు ఎంఐఎం ఆర్థిక సహాయం

MIM Donate 16 Lakhs Rupees To Kerala Relief Fund - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ఇతర రాష్ట్రాలు, రాజకీయ నేతలతో పాటు సామాన్యులు సైతం తమ వంతు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. తాజాగా ఎంఐఎం పార్టీ కూడా కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి విరాళం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆదివారం ట్విటర్‌లో ప్రకటించారు. 

మజ్లీస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంఐఎం కేరళ వరద బాధితులకు 16 లక్షల విరాళం అందజేయాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ మొత్తాన్ని సోమవారం కేరళ సీఎం రీలిఫ్‌ ఫండ్‌ అకౌంట్‌లో జమ చేయనున్నామని తెలిపారు. అంతేకాకుండా 10 లక్షల రూపాయల మందులను కేరళకు పంపనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కేరళకు సహాయం అందజేయడానికి ముందుకు రావాలని కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top