11 లేదా 12న లాక్‌డౌన్‌ పొడిగింపుపై నిర్ణయం!

Lock down extension decision to be out on 11th or 12th - Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ : ఏప్రిల్‌ 14 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కరోనాను పూర్తిగా కట్టడి చేసేందుకు అదొక్కటే మార్గమని తెలంగాణ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం ఆ దిశగా సమాలోచనలు చేస్తోందని తెలుస్తోంది. మరోవైపు, అన్ని విద్యాసంస్థల మూసివేతతో పాటు, ప్రార్థనా స్థలాలు, మత కార్యక్రమాలపై విధించిన ఆంక్షలు మే 15 వరకు కొనసాగాలని కేంద్ర మంత్రుల బృందం కూడా సిఫారసు చేసింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

పార్లమెంటు ఫ్లోర్‌ లీడర్లతో బుధవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఈనెల 11 లేదా 12వ తేదీన నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top