తమిళనాడులో మళ్లీ ‘ఐటీ’ కలకలం
సాక్షి, చెన్నై: తమిళనాడులో మళ్లీ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. చెన్నైలో మంగళవారం ఉదయం ఆదాయపన్నుశాఖ (ఐటీ) అధికారులు పలుచోట్ల దాడులు నిర్వమించారు. సత్యం సినిమాస్ కార్యాలయాలు, థియేటర్లు లక్ష్యంగా ఐటీ దాడులు జరిగాయి. దాదాపు 30 ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల తమిళనాడులో వరుసగా ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుమునుపు శశికళ, ఆమె బంధువులు ఇళ్లు, ఆస్తులు, కంపెనీలు లక్ష్యంగా పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరిగాయి. జయలలిత మరణం తర్వాత అప్పటి తమిళనాడు ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయి.