ప్రధానిగా మోడీని ఆమోదించను: అమర్త్యసేన్

ప్రధానిగా మోడీని ఆమోదించను: అమర్త్యసేన్


నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంపై నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ పెదవి విరిచాడు. దేశంలో మోడీ గుజరాత్ తరహా ప్రభుత్వాన్ని తాను అమోదించనని ఆయన స్పష్టం చేశారు. సీఎన్ఎన్-ఐబీఎన్ చానెలికిచ్చిన ఇంటర్వ్యూలో 'దేశంలో మైనారిటీలు అభద్రతాభావంతో ఉండటాన్ని భారతీయ పౌరుడిగా తాను అంగీకరించను' అని అమర్త్యసేన్ అన్నాడు.


గుజరాత్ లో చట్టబద్దంగానే, పక్కా ప్రణాళిక ప్రకారమే 2002లో మైనారిటీపై దాడులు జరిగాయని తాను భావిస్తున్నానని అమర్తసేన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అది ఒక దారుణమైన సంఘటన అని అన్నారు. అలాంటి రికార్డు ఉన్న వ్యక్తిని భారత ప్రధాన మంత్రిగా చూడటం తనకు ఇష్టం లేదు అని అన్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top