దేశ చరిత్రలో నిలిచే రోజు : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : న్యూఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ హైవే మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. దీంతో 14 వరసల ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఈరోజు దేశ చరిత్రలోనే నిలిచిపోయే రోజు. ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలిసిందే. ట్రాఫిక్ సమస్య కూడా దేశాన్ని వేధిస్తోంది.
బీజేపీ ప్రభుత్వం ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి అహర్నిశలు కృషి చేస్తోంది. ఎక్స్ప్రెస్ వే ద్వారా రాజధానిలో ట్రాఫిక్ కష్టాలు తొలగుతాయి. ఈ ఎక్స్ప్రెస్ వే ద్వారా ఢిల్లీ-మీరట్ల మధ్య ప్రయాణం కేవలం 40 నిమిషాలకు తగ్గుతుంది.’ అని మోదీ పేర్కొన్నారు.