జీఎస్‌టీ తప్పులతడక

GST hastily implemented, people suffering: Akhilesh Yadav

సాక్షి,లక్నో: జీఎస్‌టీ అమలుపై మోదీ సర్కార్‌ తొందరపాటుతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు.హడావిడిగా, తప్పులతడకగా జీఎస్‌టీ అమలుకు పూనుకోవడంతో వ్యాపారులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల అసమర్థ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, యూపీలో అభివృద్ధి నిలిచిపోయిందని అఖిలేష్‌ అన్నారు.

యూపీ సర్కార్‌ వైఫల్యాలతో ఎస్‌పీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తుకుతెచ్చుకుంటున్నారని అన్నారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top